Narendra Modi: పడవ బోల్తా ప్రమాద ఘ‌ట‌న‌పై స్పందించిన ప్రధాని మోదీ

  • పడవ ప్రమాదం ఘ‌ట‌న నన్ను కలచివేసింది
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం 
  • సహాయక చర్యలు కొనసాగుతున్నాయి 

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న‌ సాయంత్రం ఓ పడవ బోల్తా పడడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాద ఘ‌ట‌న త‌న‌ను ఎంతగానో కలచి వేసిందని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News