andhrapradesh: చంద్రన్న బీమా ఉన్న వారికి 10 లక్షలు, లేని వారికి 8 లక్షలు ఎక్స్ గ్రేషియా: చినరాజప్ప

  • మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం
  • ప్రమాద కారకులను ఎవరినీ వదిలిపెట్టం 
  • సహాయక చర్యలు ముమ్మరం 

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలను కూడా పంపామని అన్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అన్ని విధాలుగానూ ఆదుకుంటామని, తక్షణం ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News