Narendra Modi: మనీలాలో ట్రంప్ ను కలిసిన ప్రధాని మోదీ!

  • ఫిలిప్పీన్స్ చేరుకున్న మోదీ
  • కరచాలనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్న ట్రంప్, మోదీ
  • రేపట్నుంచి ఆసియాన్-భారత్ సదస్సు ప్రారంభం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకున్నారు. ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఫిలిప్పీన్స్ చేరుకున్నారు. ఈ సదస్సులో ట్రంప్ తో పాటు పలువురు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ట్రంప్, మోదీ ఇద్దరూ కలుసుకుని, కరచాలనం చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సదస్సులో ఉత్తర కొరియా అణు పరీక్షలు, దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. మోదీ, ట్రంప్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి.
.

  • Loading...

More Telugu News