Pawan Kalyan: లండన్ వెళుతున్న పవన్ కల్యాణ్.. ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోనున్న జనసేనాని

  • 15వ తేదీన లండన్ వెళుతున్న పవన్
  • ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం అవార్డు అందుకోనున్న జనసేనాని
  • భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లండన్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 15వ తేదీన ఆయన పర్యటన మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా లండన్ లో 'ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం' అందించనున్న ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ రాక కోసం లండన్ లోని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఉద్ధానం బాధితుల సమస్యలతో పాటు, పలు ప్రజాసమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరుకు ఈ అవార్డును ప్రకటించారు. 17వ తేదీన ఆయన అవార్డును స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News