akash: 'మెహబూబా'కి హీరోయిన్ గా నేహా శెట్టి ఎంపిక కావడం వెనుక రకుల్ హస్తం?

  • షూటింగ్ దశలో 'మెహబూబా'
  • హీరోగా ఆకాశ్ పూరీ 
  • కథానాయికగా నేహా శెట్టి  

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ కథానాయకుడిగా 'మెహబూబా' సినిమా తెరకెక్కుతోంది. వివిధ ప్రాంతాల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ అమ్మాయి, ఒక్కసారిగా పూరీ మూవీలో ఛాన్స్ కొట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 అయితే ఈ ఛాన్స్ రకుల్ వలన వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ 'అమన్' .. రకుల్ సొంత సోదరుడే. నేహా శెట్టి .. అమన్ ను రిక్వెస్ట్ చేయడం .. అమన్ రకుల్ చెవిలో ఓ మాట వేయడం .. రకుల్ .. పూరీకి సిఫార్స్ చేయడం జరిగిందట. అలా రకుల్ సిఫార్స్ మేరకే 'మెహబూబా'లో నేహాశెట్టికి ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో నేహా శెట్టి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి మరి.             

  • Loading...

More Telugu News