ap assembly: ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్న ఏపీ అసెంబ్లీ... చూడండి!

  • ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ
  • 10 రోజులు సాగనున్న సమావేశాలు
  • విపక్షం లేకుండా సమావేశాలు

ఈ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సందడి లేకుండా కనిపిస్తోంది. ప్రతిపక్షమైన వైకాపా ఈ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో ఖాళీగా కనిపిస్తోంది. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి, టీడీపీలోకి ప్రవేశించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేసిన తరువాతనే అసెంబ్లీకి వస్తామని చెబుతూ, వైకాపా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం సమావేశమైన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) పది పనిదినాలు అసెంబ్లీని నడిపించాలని నిర్ణయించగా, ఆపై జాతీయగీతాలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపల బోసిపోయి కనిపిస్తోంది. సభ ప్రారంభమైన అనంతరం కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు లేని అసెంబ్లీ చిత్రమిది!

  • Loading...

More Telugu News