himachal pradesh elections: బీజేపీనా? కాంగ్రెస్సా?... హిమాచల్ ప్రదేశ్ లో నేడే పోలింగ్!

  • 68 నియోజకవర్గాల్లో పోలింగ్
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
  • గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 68 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేసింది. 983 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగాను, 399 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే సమయంలో పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో కూడా అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. 

  • Loading...

More Telugu News