road: పంజాబ్‌లో పెను ప్ర‌మాదం.. లారీ ఢీ.. 9 మంది యువ‌కుల‌ మృతి!

  • భ‌టిండా జిల్లా బుచోమండి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం
  • రోడ్డు ప‌క్క‌న నిలుచుని ఉన్న యువ‌కుల‌పై లారీ దూసుకెళ్లిన వైనం
  • ద‌ట్ట‌మైన పొగ‌మంచే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అనుమానం

పంజాబ్‌లోని భ‌టిండా జిల్లా బుచోమండి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. వేగంగా వ‌స్తోన్న ఓ లారీ రోడ్డు ప‌క్క‌న నిలుచుని ఉన్న యువ‌కుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రి కొంతమందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని చెప్పారు. ఉద‌యం స‌మ‌యంలో ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఉన్న‌ కార‌ణంగా డ్రైవ‌ర్‌కు స‌రిగ్గా క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో ఈ ప్రమాదం సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు.   

  • Loading...

More Telugu News