కళావెంకట్రావు: ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు.. ఆ మాట మరిచారు!: జగన్ పై కళావెంకట్రావు విసుర్లు

  • ఇప్పుడు ఆ మాట మ‌రిచారు
  • పాదయాత్ర ప్రారంభించినప్పుడు జ‌గ‌న్‌ హోదా అంశాన్ని లేవ‌నెత్త‌డం ఏంటి?
  • తాను సీఎం అయ్యాక అంద‌రి సంగ‌తి చూస్తాన‌ని గ‌తంలో జ‌గ‌న్‌ పోలీసుల‌ను బెదిరించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాద‌యాత్ర‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు మండిప‌డుతున్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలో రాష్ట్ర‌ మంత్రి కళావెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ... పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా జ‌గ‌న్‌ ప్రత్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్త‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జ‌గ‌న్, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని అడిగారు.

ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం విశాఖప‌ట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు పెడితే దాన్ని కూడా జగన్ అడ్డుకునే య‌త్నం చేశార‌ని కళావెంకట్రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఆందోళ‌న చేయ‌డానికి వెళుతోన్న‌ జ‌గ‌న్‌ను విశాఖ‌ప‌ట్నంలోని విమానాశ్ర‌యంలో అడ్డుకుంటే, తాను త్వరలో సీఎంని అవుతానని, ఆ త‌రువాత అంద‌రి ప‌నీ చెబుతాన‌ని పోలీసుల‌ని బెదిరించారని అన్నారు. అటువంటి జ‌గ‌న్ మాట‌ల‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌బోర‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News