akbaruddin: బీజేపీని చూసి తెలంగాణ‌ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

  • అసెంబ్లీలో సభ్యులు గొడవ చేస్తున్నారు
  • స‌భ న‌డుస్తోన్న తీరు బాగోలేదంటూ అక్బ‌రుద్దీన్ వాకౌట్‌
  • మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేయ‌డం ఏంటి? 
  • రైతుల ప‌ట్ల స‌ర్కారు తీరు బాగోలేదంటూ కాంగ్రెస్ వాకౌట్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీని చూసి తెలంగాణ స‌ర్కారు ఎందుకు భయపడుతోందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాగోలేద‌ని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు గొడవ చేస్తున్నా సభను నడపటం స‌రైంది కాద‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేద‌ని, వాయిదా వేయాలని సూచించారు. స్పీక‌ర్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని వ్యాఖ్యానించారు. అనంత‌రం స‌భలోంచి ఆయ‌న వాకౌట్ చేశారు.

కాగా, రైతుల సమస్యలపై తెలంగాణ స‌ర్కారు క‌న‌బ‌రుస్తోన్న తీరు బాగోలేద‌ని కాంగ్రెస్‌ పార్టీ కూడా స‌భ‌లోంచి వాకౌట్‌ చేసింది. మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేయ‌డం ఏంట‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

  • Loading...

More Telugu News