Indian Army: హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. జవాను వీరమరణం!

  • కార్డన్‌సెర్చ్‌లో తారసపడిన ఉగ్రవాదులు
  • ఇరు వర్గాల మధ్య  హోరాహోరీ కాల్పులు
  • ఉగ్రవాదులను కాల్చి చంపిన ఆర్మీ

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఆర్మీ జవాను వీర మరణం పొందారు. పుల్వామాలోని అగ్లర్ ఏరియా కంది బెల్ట్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో ఓ పౌరుడికి కూడా గాయాలయ్యాయి.

ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో కంది ఏరియాలో ఆర్మీ కార్డన్‌సెర్చ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఆర్మీని చూసిన మిలిటెంట్లు వారిపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాను కూడా అమరుడైనట్టు ఆర్మీ తెలిపింది. చనిపోయిన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని ఆర్మీ పేర్కొంది.

కాగా, నవంబరు 2న పుల్వామాలోని పాంపోర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులు కాగా, సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ మిలిటెంట్‌ను కాల్చి చంపారు.

  • Loading...

More Telugu News