Pawan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • బల్గేరియాలో కీర్తితో పవన్ పాట 
  • మలయాళంలోకి వెళ్లిన 'ఫిదా'
  • నితిన్ తో ప్రవీణ్ సత్తారు ప్రాజక్ట్ 
  • విజయ్ 'ఇంద్రసేన' రిలీజ్ డేట్ ఖరారు

*  పవన్ కల్యాణ్ తో ఆడిపాడడం కోసం కీర్తి సురేష్ నిన్న బల్గేరియాకు వెళ్లింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా బల్గేరియాలో జరుగుతున్న సంగతి విదితమే. ఈ షూటింగుకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణలో పాల్గొనడానికి కీర్తి సురేష్ నిన్న బల్గేరియాకు వెళ్లింది. నేటి నుంచి ఈ పాటను చిత్రీకరిస్తారు.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో మలయాళంలోకి డబ్ చేశారు. అక్కడ త్వరలో రిలీజ్ చేస్తున్నారు.
*  తాజాగా 'పీఎస్వీ గరుడవేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ సొంత సంస్థ శ్రేశ్ట్ మూవీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంథోనీ హీరోగా నటించిన 'ఇంద్రసేన' చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డయానా చంపిక కథానాయికగా నటించింది.      

  • Loading...

More Telugu News