Mahesh Babu: ముఖ్యమంత్రి ఛాంబర్లో మహేశ్ బాబు .. కీలక సన్నివేశాల చిత్రీకరణ!

  • షూటింగ్ దశలో 'భరత్ అను నేను' 
  • ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు
  • హైదరాబాద్ లో షూటింగ్ 
  • కథానాయికగా కైరా అద్వాని

పక్కా ప్లానింగ్ తో కొరటాల శివ 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తండ్రి చనిపోవడంతో ఆ స్థానంలో ముఖ్యమంత్రి అయిన యువకుడిగా ఈ సినిమాలో మహేశ్ కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 5 కోట్ల ఖర్చుతో అసెంబ్లీ సెట్ వేసి కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.

 ఆ తరువాత షెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే కానిచ్చేస్తున్నారు. కొన్ని రోజులుగా సి.ఎం. చాంబర్ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకి కథానాయికగా కైరా అద్వాని పరిచయమవుతోంది. కొరటాల - మహేశ్ కాంబినేషన్లో రెండవదిగా వస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News