Cricket: రెండో టీ20: ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బలు

  • 1.2 ఓవ‌ర్ వ‌ద్ద‌ ఆరు ప‌రుగుల‌కే తొలి వికెట్
  • 2వ ఓవ‌ర్ చివ‌రి బంతికి 11 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్
  • రోహిత్ శ‌ర్మ (5), శిఖ‌ర్ ధావ‌న్ (1) ఔట్
  • టీమిండియా స్కోరు 3 ఓవ‌ర్ల వ‌ద్ద 21

గుజ‌రాత్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రుగుతోన్న‌ భార‌త్‌-న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ముందు కివీస్ 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య ఛేద‌న‌లో క్రీజులోకి దిగిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి.

1.2 ఓవ‌ర్ వ‌ద్ద‌ ఆరు ప‌రుగుల‌కే వికెట్ కోల్పోయింది. ఆ వెంట‌నే 2వ ఓవ‌ర్ చివ‌రి బంతికి 11 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (5) శిఖ‌ర్ ధావ‌న్ (1) క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే వెనుదిర‌గ‌డంతో భార‌త అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ప్ర‌స్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్య‌ర్ 10, విరాట్ కోహ్లీ 5 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 3 ఓవర్ల‌కి 21గా ఉంది.

  • Loading...

More Telugu News