Pawan Kalyan: 840 మంది పార్టీ స‌మన్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యం

  • ఈ నెల 6 నుంచి జ‌న‌సేన సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియ
  • వ‌చ్చేనెల 7 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి
  • అనంత‌రం ఎంపికైన స‌మ‌న్వ‌య క‌ర్త‌లతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశం

త‌మ‌ పార్టీ సమన్వయకర్తల నియామకానికి జనసేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సన్నాహాలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం చేస్తున్నట్లు ఈ రోజు జనసేన ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం 840 మంది పార్టీ స‌మన్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎల్లుండి నుంచి జనసేన సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియను ప్రారంభించ‌నున్నారు. వ‌చ్చేనెల 7 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనంత‌రం ఎంపికైన స‌మ‌న్వ‌య క‌ర్త‌లతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశం కానున్నారు.    

  • Loading...

More Telugu News