mahith narayan: చక్రి ఆస్తులను ఆయన భార్య నుంచి లాక్కోలేదు .. అద్దె ఇంట్లో ఉంటున్నాం : మహిత్ నారాయణ్

  • చక్రి నాకు స్టూడియో ఇవ్వలేదు 
  • అది నా పేరున ఉందనేది అబద్ధం 
  • ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాను 
  • అన్నయ్య పోయాడనే దానికన్నా ఏదీ ఎక్కువ బాధను కలిగించలేదు   

చక్రి చనిపోయిన తరువాత ఆయన ఆస్తులను అనుభవిస్తూ .. ఆయన భార్యను రోడ్డున పడేశారంటూ కుటుంబ సభ్యులపై అప్పట్లో వార్తలు షికారు చేశాయి. ఆ విషయాన్ని గురించి మహిత్ నారాయణ్ దగ్గర ఐ డ్రీమ్స్ ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. "నిజంగా అన్నయ్య ఆస్తులను నేను లాగేసుకుంటే అద్దింట్లో ఉండాల్సిన అవసరం ఏవుంది? క్యాబుల్లో తిరగాల్సిన అవసరం ఏవుంది? అవన్నీ నిజంగా తీసుకుని ఉంటే .. ఈ రోజున మేం ఇంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా" అన్నారు.

 "ఇదంతా కొంతమంది చేస్తోన్న ప్రచారం. ఈ రోజున స్టూడియో కూడా లేకుండా చిన్న ఎక్విప్ మెంట్ ఇంట్లో పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాను. స్టూడియో నా పేరున వుందనేది కూడా అబద్ధమే. దాని విషయంలోను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ విషయంలో ఫైట్ చేసి అలసిపోవాలనుకోవడం లేదు. వచ్చేవి వస్తాయి .. పోయేవి పోతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా .. అవి అన్నయ్యను పోగొట్టుకున్నంత పెద్దవైతే కాదు .. అవి అంతకన్నా ఎక్కువ బాధను కలిగించలేవు"అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.    

  • Loading...

More Telugu News