nikhil: నిఖిల్ మూవీ సెట్ పైకి వెళ్లకుండానే సేల్ చేసేశారు!

  • 'కిరిక్ పార్టీ' రీమేక్ లో నిఖిల్ 
  • తదుపరి సినిమాగా 'కణితన్' రీమేక్ 
  • నిర్మాతగా ఠాగూర్ మధు
  • త్వరలోనే పూర్తి వివరాలు    

యూత్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ నిఖిల్ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం 'కిరిక్ పార్టీ' రీమేక్ చేస్తోన్న ఆయన, త్వరలో 'కణితన్' అనే తమిళ సినిమా తెలుగు రీమేక్ చేయనున్నాడు. అధర్వ - కేథరిన్ జంటగా సంతోష్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో నిర్మించడానికి ఠాగూర్ మధు రంగంలోకి దిగారు.

 అయితే సెట్స్ పైకి వెళ్లకముందే ఆయన ఈ ప్రాజెక్టును సేల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఫస్టు కాపీని తమకి 11 కోట్లకి ఇవ్వమని ఓ పార్టీ అడిగిందట. ఆ డీల్ కి ఆయన ఓకే చెప్పాడని .. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఏడెనిమిది కోట్లలో ఆయన ఈ సినిమాను పూర్తి చేయగలిగితే, మిగిలినదంతా లాభమే. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.  

  • Loading...

More Telugu News