l.ramana: తెలంగాణ‌లో అప్ప‌టి ప‌రిస్థితులే నేడు పున‌రావృత‌మ‌వుతున్నాయి: ఎల్‌.ర‌మ‌ణ

  • హైద‌రాబాద్‌లో టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం
  • కుటిల‌ రాజ‌కీయాలు చేసే ప్ర‌భుత్వాల గుత్తాధిప‌త్యాల‌ను బ‌ద్ద‌లుకొట్టిన పార్టీ టీడీపీ
  • గ‌తంలో తెలంగాణ‌లో గ‌డీల పాల‌నకు టీడీపీ చ‌ర‌మ‌గీతం పాడింది

కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ అన్నారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడి అధ్య‌క్ష‌త‌న టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఎల్‌.ర‌మ‌ణ మీడియాతో మాట్లాడుతూ... త‌మ పార్టీ ప్ర‌జా శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోందని చెప్పారు. కుటిల‌ రాజ‌కీయాలు చేసే ప్ర‌భుత్వాల గుత్తాధిప‌త్యాల‌ను బ‌ద్ద‌లుకొట్టిన పార్టీ టీడీపీ అని ఉద్ఘాటించారు. గ‌తంలో టీడీపీ తెలంగాణ‌లో గ‌డీల పాల‌నకు  చ‌ర‌మ‌గీతం పాడిందని అన్నారు. ఇప్పుడు కూడా అవే ప‌రిస్థితులు పున‌రావృతం అవుతున్నాయ‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News