kidnap: స్కూల్లోంచి నాలుగేళ్ల‌ చిన్నారి కిడ్నాప్.. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల డిమాండ్

  • ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని వండ‌ర్ కిడ్స్ స్కూల్లో ఘ‌ట‌న‌
  • భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లోనే కిడ్నాప‌ర్లు ఉన్నార‌ని అనుమానం
  • స్కూలు యాజ‌మాన్యానికి మాయ‌మాట‌లు చెప్పి చిన్నారిని అప‌హ‌రించిన వైనం


  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని వండ‌ర్ కిడ్స్ స్కూల్లో నాలుగేళ్ల‌ చిన్నారి శ్యామ్‌ను దుండ‌గులు కిడ్నాప్ చేశారు. స్కూలు వ‌ద్ద‌కు వ‌చ్చిన కొంత మంది దుండ‌గులు శ్యామ్ తండ్రికి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఆ చిన్నారిని తీసుకెళ్లాల‌ని న‌మ్మ‌బ‌లికారు. ఆ చిన్నారికి సంబంధించిన ప‌లు వివ‌రాల‌ను ఆ దుండ‌గులు స‌రిగ్గానే చెప్ప‌డంతో ఆ స్కూలు యాజ‌మాన్యం వారి మాట‌ల‌ను న‌మ్మిన‌ట్లు తెలుస్తోంది.

అనంత‌రం ఆ బాలుడి త‌ల్లిదండ్రుల‌కి ఫోన్ చేసిన కిడ్నాప‌ర్లు ఐదు ల‌క్ష‌ల రూపాయలు ఇస్తేనే వ‌దిలేస్తామ‌ని బెదిరించారు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ బాలుడి గురించి గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లోనే కిడ్నాప‌ర్లు ఉన్నార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News