suicide: గోదావరిలో దూకి కూతుళ్ల‌తో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లిదండ్రులు!

  • పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతంలో ఘ‌ట‌న‌ 
  • త‌మ ఆత్మ‌హ‌త్య‌కు ఎవ‌రూ కార‌కులు కార‌ని లేఖ 
  • గోదావరిలో మృతదేహాల కోసం గాలింపు ప్రారంభం  

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్దాంతంలో విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కూతుళ్ల‌తో పాటు త‌ల్లిదండ్రులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ జిల్లాలోని తానూరుకు చెందిన బొబ్బిలి శివనాగరాజు (36) త‌న బైక్‌పై తన భార్య వరలక్ష్మి (30), కుమార్తెలు అమృత (9), చంద్రిక(8) తో కలిసి బ‌య‌లుదేరి, సిద్దాంతం సమీపంలో గోదావరి నది వ‌ద్ద ఆపాడు. అనంత‌రం ఆ కుటుంబం అంతా అందులో దూకి ఆత్మహత్యకు పాల్ప‌డింది.

అంత‌కు ముందు తమ ఆత్మహత్యకు ఎవరూ కారకులు కార‌ని ఓ లేఖ‌లో రాసిన శివ‌నాగ‌రాజు.. దాన్ని త‌న బైక్‌లో ఉంచాడు. ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని వాహనాన్ని, లేఖను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గోదావ‌రిలో ఆ కుటుంబ స‌భ్యుల‌ మృతదేహాల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. వారు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి దారితీసిన‌ కార‌ణాలపై వివ‌రాలు తెలియాల్సి ఉంది.   

  • Loading...

More Telugu News