pooja hegde: అటు ఎన్టీఆర్ జోడీగా .. ఇటు మహేశ్ సరసన పూజా హెగ్డే?

  • బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తోన్న పూజా హెగ్డే 
  • ఎన్టీఆర్ మూవీ కోసం ఆమె ఎంపిక జరిగినట్టు వార్తలు 
  • మహేశ్ సినిమా కోసం తీసుకునే ఆలోచనలో వంశీ పైడిపల్లి
  • డేట్స్ సర్దుబాటు చేయడంలోనే ఉందంతా      

'దువ్వాడ జగన్నాథం' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, కుర్రకారు మనసులను దోచేసింది. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో చేసే ఛాన్స్ ఉందంటూ ఫిల్మ్ నగర్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 ప్రస్తుతం పవన్ తో 'అజ్ఞాతవాసి'ని తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్, ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. ఇక మహేశ్ 25వ సినిమాను తెరకెక్కించనున్న వంశీ పైడిపల్లి కూడా, ఈ సినిమాలో ఓ కథానాయికగా పూజా హెగ్డేను తీసుకుందామని భావిస్తున్నాడట. డేట్స్ సర్దుబాటు చేయగలిగితే .. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూజాకి దక్కినట్టేననే టాక్ వినిపిస్తోంది.    

  • Loading...

More Telugu News