suicide: చదువు ఒత్తిడి భ‌రించ‌లేక మ‌రో విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

  • తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోన్న‌ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు
  • ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
  • స్కూల్లో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలిపిన‌ త‌ల్లిదండ్రులు

చదువు ఒత్తిడి భ‌రించ‌లేక మ‌రో విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు అల‌జ‌డి రేపుతోన్న విష‌యం తెలిసిందే. పాఠ‌శాల‌ విద్యార్థుల నుంచి పీజీ చ‌దువుతోన్న విద్యార్థుల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి. చ‌దువుల్లో పోటీని తట్టుకోలేక‌, చ‌దువే లోకం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు.

ఈ రోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో రంగు సౌజన్య (15) అనే పదో తరగతి విద్యార్థిని ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్పడింది. స్కూల్లో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని సౌజ‌న్య త‌ల్లిదండ్రులు అంటున్నారు. 

  • Loading...

More Telugu News