fire: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం... 47 మంది మృతి

  • జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లో బాణ‌సంచా క‌ర్మాగారంలో ఘ‌ట‌న‌
  • ఫ్యాక్ట‌రీ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోవ‌డంతో భారీగా ప్రాణ న‌ష్టం
  • మ‌రో 43 మందికి తీవ్ర‌గాయాలు

ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభవించి 47 మంది అగ్నికి ఆహుత‌య్యారు. ఓ బాణసంచా కర్మాగారంలో ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించి, మంట‌లు వ్యాపించాయి. అందులో ఉన్న వారు అక్క‌డి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోవ‌డంతో మృతుల సంఖ్య భారీగా న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌లో మరో 43 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు చెప్పారు. బాణసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడుతో దాని ప‌క్క ఉన్న‌ ఫ్యాక్టరీ కూడా సగం వరకు కూలిపోయింది. ఆ ప‌రిసరాల్లోని కార్లు కూడా కాలిపోయాయి. అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు.  

  • Loading...

More Telugu News