rajasekhar: సెన్సార్ పూర్తి చేసుకున్న 'గరుడవేగ' .. వచ్చేనెల 3న రిలీజ్

  • రాజశేఖర్ హీరోగా 'గరుడవేగ'
  • కథానాయికగా పూజా కుమార్ 
  • సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ  

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు 'గరుడవేగ' సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

 25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఇక చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రాజశేఖర్, ఈ సినిమాతో తనకి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి.           

  • Loading...

More Telugu News