DK Aruna: తెలంగాణ ఉద్యమంలోనూ ఇదే జ‌రిగింద‌ని తెలుసుకో: కేసీఆర్‌పై ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్ర‌హం

  • రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం
  • అధికార‌, విప‌క్ష నేత‌ల మ‌ధ్య అప్పుడే మాట‌ల తూటాలు
  • రైతులు త‌న‌ని గ‌ద్దె దింపుతారేమోన‌ని కేసీఆర్‌కు వ‌ణుకు
  • ఉద్య‌మాన్ని అణిచివేయాల‌ని చూస్తే అది మరింత ఎగిసి ప‌డుతుంది

రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుండ‌డంతో అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ‌లో నిరంకుశ పాల‌న కొన‌సాగుతోంద‌ని అన్నారు.

 రైతులు త‌న‌ని గ‌ద్దె దింపుతారేమోన‌ని కేసీఆర్‌కు వ‌ణుకు పుడుతోంద‌ని చెప్పారు. తాము చేస్తోన్న ఉద్య‌మాన్ని అణిచివేయాల‌ని చూస్తే అది మరింత ఎగసిప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలోనూ ఇదే జ‌రిగింద‌ని, ఈ విష‌యాన్ని కేసీఆర్ తెలుసుకోవాల‌ని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News