Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం.. ప్రయాణికులు సేఫ్!

  • హైదరాబాదు నుంచి బీదర్ వెళ్తున్న కుటుంబం
  • రామచంద్రాపురం ఓఆర్ఆర్ వరకు వచ్చేసరికి మంటలు
  • అప్రమత్తమై కిందికి దిగిన కుటుంబ సభ్యులు

హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్థమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి బీదర్ వెళ్తుండగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఏపీ 9 బీకే 2999 కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ సహా కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు మంటలను గుర్తించగానే వెంటనే కిందికి దిగేశారు. ఆ వెంటనే కారును మంటలు చుట్టుముట్టాయి. దీంతో కారు పూర్తిగా దగ్థమైంది. 

  • Loading...

More Telugu News