rajamouli: లండన్‌లో రాజ‌మౌళి.. అమరావతి పరిపాలన భవనాల డిజైన్ల పరిశీల‌న‌.. సూచనలు

  • నార్మన్‌పోస్టర్‌ సంస్థ రూపొందించిన భ‌వ‌న నమూనాల‌ పరిశీలన
  • రాజమౌళితో పాటు మంత్రి నారాయ‌ణ‌, ఎంపీ గల్లా జయదేవ్‌, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్
  • ఈనెల 23 నుంచి లండన్‌లో చంద్రబాబు పర్యటన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించాల్సిన‌ పరిపాలన భవనాల డిజైన్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌ల‌హాలు తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ పనిమీదే రాజ‌మౌళితో పాటు ఏపీ మంత్రి నారాయ‌ణ బృందం ప్రస్తుతం లండ‌న్‌లో ప‌ర్య‌టిస్తోంది. నార్మన్‌పోస్టర్‌ సంస్థ రూపొందించిన భ‌వ‌న నమూనాల‌ను మంత్రి నారాయ‌ణ‌, ఎంపీ గల్లా జయదేవ్‌, రాజమౌళి, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్ ప‌రిశీలిస్తు‌న్నారు. కాగా, ఈనెల 23 నుంచి లండన్‌లో చంద్రబాబు నాయుడు పర్యటించి, నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ రూపొందించిన‌ భ‌వ‌న న‌మూనాల‌ను ఎంపిక చేయ‌నున్నారు. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించి నార్మ‌న్ పోస్ట‌ర్ ప్ర‌తినిధుల‌కు రాజ‌మౌళి సూచ‌న‌లు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News