sai dharam tej: గోపీచంద్ మలినేనితో మెగాహీరో మూవీ!

  • వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 
  • మాస్ యాక్షన్ తో కూడిన కంటెంట్ 
  • ఆ తరువాత సినిమా కరుణాకరన్ తో 
  •  అదే సమయంలో గోపీచంద్ మలినేని ప్రాజక్ట్ 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తికాగానే కరుణాకరన్ తో ఓ మూవీ చేయనున్నాడు. రొమాంటిక్ లవ్ కాన్సెప్ట్ తో ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగానే మరో ప్రాజెక్టుతో తేజు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

 ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. గోపీచంద్ మలినేని. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'విన్నర్' ఓ మాదిరిగా ఆడింది. అయినా రీసెంట్ గా ఆయన వినిపించిన కథపై గల నమ్మకంతో తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. 'గౌతమ్ నంద' వంటి భారీ సినిమాను అందించిన భగవాన్ - పుల్లారావు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారైనా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News