nagarjuna: తెలుగు రాష్ట్రాల్లో 'రాజుగారి గది 2' తొలిరోజు వసూళ్లు

  • నిన్న విడుదలైన 'రాజుగారి గది 2'
  • బలమైన కంటెంట్ ను ఎంచుకున్న ఓంకార్ 
  • ప్రధాన పాత్రల్లో నాగ్ - సమంత 
  • మరో ముఖ్యమైన పాత్రలో శీరత్ కపూర్

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన 'రాజుగారి గది 2' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో సక్సెస్ ను సాధించిన 'ప్రేతమ్' మూవీలోని ఓ పాయింట్ ను తీసుకుని తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ఇది. నాగార్జున .. సమంత .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 3.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. నైజామ్ లో 1.51 కోట్లు .. సీడెడ్ లో 51 లక్షలు .. నెల్లూరులో 14 లక్షలు .. గుంటూరులో 47 లక్షలు .. కృష్ణాలో 27 లక్షలు .. వెస్ట్ గోదావరిలో 26 లక్షలు .. ఈస్ట్ గోదావరిలో 36 లక్షలు .. వైజాగ్ లో 41 లక్షలను రాబట్టింది. గతంలో వచ్చిన 'రాజుగారి గది' హిట్ కావడం ..  నాగ్ - సమంత ప్రధానమైన పాత్రలను పోషించడం ఈ సినిమాకి కలిసొచ్చింది.     

  • Loading...

More Telugu News