mahesh babu: 'భరత్ అను నేను' తాజా షెడ్యూల్ మొదలు .. మహేశ్ బాబు హాజరు

  • షూటింగ్ దశలో 'భరత్ అను నేను'
  • 'స్పైడర్' ప్రమోషన్స్ కారణంగా బ్రేక్
  • ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లొచ్చిన మహేశ్
  • కొరటాల మూవీలో మహేశ్ జోడీగా కైరా అద్వాని

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన అసెంబ్లీ సన్నివేశాలను ఈ మధ్యనే చిత్రీకరించారు. ఆ తరువాత మహేశ్ 'స్పైడర్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికీ, ఆ తరువాత ఫ్యామిలీతో సరదాగా విదేశాలకి వెళ్లిరావడానికి గాను బ్రేక్ ఇచ్చారు.

ఇక విదేశాల నుంచి మహేశ్ తిరిగి రావడంతో, ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ రోజున హైదరాబాద్ లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అలరించనుంది. మహేశ్ చేసిన 'బ్రహ్మోత్సవం' .. ' స్పైడర్' ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోకపోవడంతో, ఈ సినిమా ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.     

  • Loading...

More Telugu News