rana: మరో మూవీని రెడీ చేస్తోన్న రానా .. ఈ ఏడాది చివర్లో రిలీజ్!

  • కొత్తదనమున్న కథలను ఎంచుకుంటోన్న రానా
  • ఈ ఏడాది మూడు హిట్లు సొంతం 
  • నెక్స్ట్ మూవీలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర 
  • కథానాయికలుగా రెజీనా .. లీషా    

కొత్తదనంతో కూడిన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ రానా తన కెరియర్ ను పరుగులు తీయిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 'ఘాజీ' సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆయన, ఆ తరువాత 'బాహుబలి 2'తో కట్టిపడేశాడు. ఇక ఈ మధ్య వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' రానా నటనలో కొత్త కోణాన్ని వెలికి తీసింది. ఈ మూడు సినిమాలు కూడా వేటికవే భిన్నమైనవి. అందువలన అవి సక్సెస్ బాటలో ప్రయాణించాయనేది రానా నమ్మకం.

ఆ నమ్మకంతోనే ఆయన తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు. సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా పేరు 'మదై తీరాతు'. తెలుగులో ఈ సినిమాకి '1945' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ రోజు రెండవ షెడ్యూల్ ను మొదలుపెడుతోందని రానా చెప్పాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయన కనిపించే ఈ సినిమాలో, రెజీనా .. లీషా కథానాయికలు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రానా వున్నాడని సమాచారం.

  • Loading...

More Telugu News