prabhas: పునర్జన్మ నేపథ్యంలో సాగే కథగా 'సాహో'?

  • ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'సాహో'
  • రెండు వేరు వేరు కాలాలకి సంబంధించిన కథ
  • ఇటీవలే ఫస్టు షెడ్యూల్ పూర్తి
  • తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్, నిన్నమొన్నటివరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఈ కథ పునర్జన్మ నేపథ్యంలో కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలోను .. స్వాతంత్య్రం వచ్చిన తరువాత .. ఇలా రెండు వేర్వేరు కాలాల్లో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. బ్రిటీష్ వారి కాలంలో షూటింగ్ చేయవలసి రావడం వల్లనే, భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోందనే సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News