mahesh babu: 'భరత్ అను నేను' షూటింగ్ కి రంగం సిద్ధం .. జాయిన్ కానున్న మహేశ్ బాబు

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అను నేను' 
  • విదేశాలకి వెళ్లడం కోసం బ్రేక్ తీసుకున్న మహేశ్
  • ఈ నెల 15 నుంచి తాజా షెడ్యూల్ మొదలు
  • కథానాయికగా కైరా అద్వాని

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' షూటింగ్ మొదలై కొంతకాలమైంది. అయితే 'స్పైడర్' ప్రమోషన్స్ విషయంలో మహేశ్ బిజీగా ఉండటం వలన .. ఆ తరువాత ఆయన విదేశాలకి వెళ్లడం వలన ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఆ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో మహేశ్ బాబు జాయిన్ కానున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫిబ్రవరి నాటికి ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'శ్రీమంతుడు' తరువాత ఆ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.   

  • Loading...

More Telugu News