cricket: రెండో టీ20కి సర్వం సిద్ధం... ఎలాగైనా గెలవాలని ఆసీస్ పట్టుదల!

  • రెండో టీ20కి సిద్ధమైన గౌహతీ స్టేడియం
  • మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటున్న టీమిండియా
  • మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై ఆసక్తి నింపాలని భావిస్తున్న ఆసీస్

రెండో టీ20కి సర్వం సిద్దమైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 అభిమానులకు పసందైన విందును అందించలేకపోయింది. వరుణుడు అడ్డుపడడంతో తొలి టీ20కి అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం ధాటిగా ఆడిన టీమిండియా విజయం సాధించింది.

అయితే ఈ విజయం పట్ల టీమిండియా, అభిమానులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గుహవటి వేదికగా జరగనున్న రెండో వన్డేకి సర్వం సిద్ధమైంది. రెండో టీ20 మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఆ లోటు పూడ్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

ఇదే సమయంలో టెస్టు, వన్డే సిరీస్ కోల్పోవడంతో కనీసం టీ20 సిరీస్ లోనైనా విజయం సాధించడం ద్వారా చిత్తుగా ఓడిపోయారనే అపప్రధను పోగొట్టుకోవాలని ఆసీస్ జట్టు భావిస్తోంది. వార్నర్, ఫించ్, మ్యాక్స్ వెల్, క్రిస్టియన్, హెన్రిక్స్ వంటి స్టార్ హిట్టర్లు ఉన్నప్పటికీ జట్టు ఓటమిపాలు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

 ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రెండు జట్ల అభిమానులకు పసందైన క్రికెట్ విందు అందిస్తుందని ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ టీమిండియాదే, ఆసీస్ గెలిస్తే ఫైనల్ పోరు మరింత ఆసక్తిగా మారుతుంది. 

  • Loading...

More Telugu News