kuwaiat: కువైట్ లో కడప జిల్లాకు చెందిన వ్యక్తి దారుణ హత్య

  • రూమ్మేట్లే హత్య చేసి ఉంటారని భావిస్తున్న కువైట్ పోలీసులు
  • ఇద్దరు కేరళవాసులు అరెస్ట్
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

బతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన కడప జిల్లా వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇతడిని నందలూరు గ్రామస్తుడు సయ్యద్ పీర్ గా గుర్తించారు. సయ్యద్ తో పాటు రూములో ఉన్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని కువైట్ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి కువైట్ పోలీసులు ఇద్దరు కేరళ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్తను తెలుసుకున్న సయ్యద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సయ్యద్ భార్య ప్రభుత్వాన్ని కోరింది.

  • Loading...

More Telugu News