modi: షాకింగ్... పెళ్లంటూ చేసుకుంటే మోదీనే చేసుకుంటా..కట్నం కూడా ఇస్తా!: ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగిన మహిళ

  • మోదీని పెళ్లి చేసుకుంటానని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జయశాంతి
  • పెళ్లాడితే మోదీనే పెళ్లాడుతా
  • ఆస్తులన్నీ అమ్మి 2 కోట్ల రూపాయలు కట్నం ఇస్తా

పెళ్లంటూ చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీనే వివాహం చేసుకుంటానని ఒక మహిళ నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేస్తోందంటే ఆశ్చర్యం కలగకమానదు. దాని వివరాల్లోకి వెళ్తే... నిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్‌ లోని జైపూర్‌ కు చెందిన జయశాంతి (45) అనే మహిళ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. దీనిపై ఆమెను సంప్రదించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది.

1989తో తనకు వివాహమైందని, అయితే, ఏడాది తరువాత తన భర్త ఎక్కిడికో వెళ్లిపోయారని ఆమె చెప్పింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని ఆమె తెలిపింది. తరువాత వివాహం చేసుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చినా తాను నిరాకరించానని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రధాని సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పింది. మోదీ అంగీకరిస్తే తన ఆస్తులన్నీ అమ్మి 2 కోట్ల రూపాయలు వరకట్నం ఇస్తానని ఆమె తెలిపింది. జంతర్ మంతర్ నుంచి తనను ఖాళీ చేయిస్తే మాత్రం నేరుగా ప్రధాని నివాసం ముందు ఆందోళన కొనసాగిస్తానని ఆమె తెలిపింది. 

  • Loading...

More Telugu News