rashmi: 'సుడిగాలి' సుధీర్ తో పెళ్లి గురించి స్పందించిన యాంకర్ రష్మి!

  •  రష్మి తాజా చిత్రంగా 'నెక్స్ట్ నువ్వే'
  •  ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చట్లు 
  •  సుడిగాలి సుధీర్ తో పెళ్లి గురించిన ప్రశ్న
  •  అలాంటి అపోహలు వద్దంటూ రష్మి సమాధానం     

బుల్లితెరపై మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో రష్మి ఒకరు. ఆ క్రేజ్ తోనే ఆమె సినిమా ఛాన్సులను కూడా దక్కించుకుని, నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. ఆమె తాజా చిత్రంగా 'నెక్స్ట్ నువ్వే' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులతో రష్మి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకి చాలా వరకూ సహనంతో మాట్లాడిన ఆమె, అప్పుడప్పుడు కాస్తంత అసహనానికి కూడా లోనైంది.

 సుడిగాలి సుధీర్ తో ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ .. పెళ్లి చేసుకుంటారా? అంటూ అభిమానులు ప్రశ్నించారు. తాను .. సుధీర్ కలిసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తుండటం వలన అలాంటి భావన ఆడియన్స్ కి కలిగి ఉండొచ్చని రష్మి అంది. తాము చేస్తోన్న షో మంచిగా రావడం కోసం మిగతా వాళ్లతో ఉన్నట్టుగానే సుధీర్ తోను కాస్త క్లోజ్ గా ఉండాల్సి వస్తుందనీ, అది చూసి తాము లవ్ లో పడ్డామని అనుకోవడం .. పెళ్లి చేసుకుంటారనే నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పేసింది.   

  • Loading...

More Telugu News