neil nithin: 'సాహో' షూటింగులో జాయినైన విలన్!

  • సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో'
  •  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్
  •  విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ 
  •  కథానాయికగా శ్రద్ధా కపూర్      

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ షెడ్యూల్లో జాయినయ్యాడు.

నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ - నీల్ నితిన్ తలపడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదల కానుంది. డిఫరెంట్ షేడ్స్ కలిగిన కథానాయిక పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.      

  • Loading...

More Telugu News