నేటి రాత్రి తాజ్ మహల్ వద్ద మరో అద్భుతం... క్యూ కడుతున్న పర్యాటకులు
- నేడు శరద్ పూర్ణిమ
- తాజ్ పై పడనున్న వెండి వెలుగులు
- చేరుకుంటున్న దేశ విదేశీ పర్యాటకులు
- రాత్రి 8.30 నుంచి 12.30 వరకూ అద్భుతం
తాజ్ మహల్ పాలరాళ్లపై పడే చంద్రుని వెలుగులను వీక్షించడానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. పూర్ణ చంద్రుని కిరణాలు తాజ్ పై పడి మెరుస్తుంటే, ఆ అద్భుతాన్ని చూడటానికి ఇప్పటికే ఆగ్రాకు దేశ, విదేశీ పర్యాటకులు క్యూ కట్టారు. నేటి రాత్రి 8.30 నుంచి 12.30 గంటల వరకూ పున్నమి చంద్రుడి కాంతులను తాజ్ పై చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.