తాజ్ మహల్ ను కూలగొడితే బీజేపీకి మద్దతిస్తా: సమాజ్ వాదీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్య
- తాజ్ తో పాటు ఎర్రకోట, పార్లమెంట్, కుతుబ్ మినార్ వద్దు
- అవన్నీ బానిసత్వానికి ప్రతీకలు
- అన్నింటినీ కూల్చాలని ఆజం ఖాన్ డిమాండ్
యూపీ టూరిజం మంత్రి రీటా బహుగుణ ఆధ్వర్యంలో తయారు చేసిన ఓ పర్యాటక బ్రోచర్ లో తాజ్ ప్రస్తావన లేకపోవడం కలకలం రేపగా, ఆజం ఖాన్ స్పందించారు. వారణాసిలో గంగా హారతి ముఖ చిత్రంతో, కవర్ పేజీపై ఆదిత్యనాథ్, బహుగుణ చిత్రాలతో తయారైన 32 పేజీల పుస్తకాన్ని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజ్ మహల్ ను కూల్చి వేయాలన్న ఆజం ఖాన్ వ్యాఖ్యలపై, బహుగుణ మాట్లాడుతూ, తాజ్ ఓ సుప్రసిద్ధ కట్టడమని, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమని, ఇప్పటికే తాజ్ పరిరక్షణకు రూ. 156 కోట్లు కేటాయించామని తెలిపారు. ఖాన్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.