nagarjuna: వర్మ సంచలన ప్రకటన .. నాగ్ హీరోగా మరో యాక్షన్ మూవీ!

  • నాగ్ హీరోగా కొత్త సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ
  • పూర్తిస్థాయి యాక్షన్ తో కూడిన కంటెంట్
  • గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'శివ' ఓ సంచలనం
  • అందరిలో ఆసక్తిని రేకెత్తించే తాజా ప్రాజెక్ట్    

రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో కొన్ని ఆదిలోనే ఆగిపోతే .. మరికొన్ని మాత్రం పట్టాలెక్కేస్తూ ఉంటాయి. ఈ కోవలో నాగార్జున హీరోగా తాను మరో సినిమాను తెరకెక్కించనున్నట్టు తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివ' అప్పట్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ సినిమా తర్వాత ఇద్దరి కలయికలోను 'అంతం', 'గోవిందా గోవిందా' చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు నాగార్జునతో చేయడానికి వర్మ సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఇది 'శివ' సినిమాకి సీక్వెల్ కాదు .. అంతకి మించిన డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని వర్మ అన్నాడు. వాస్తవానికి దగ్గరగా వుండే యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నాడు.   

  • Loading...

More Telugu News