ntr: చ‌రిత్ర‌లో నిలిచిపోయే పాత్ర‌లో న‌టించాల‌ని అనుకున్నా: జూ. ఎన్టీఆర్‌

  • ‘జై ల‌వ‌కుశ’ విజయం పట్ల ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ హ‌ర్షం
  • ‘జై’ అనే పాత్ర ‌మా గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోతుంది
  • సినిమాకి డ‌బ్బులు వ‌చ్చాయా రాలేదా అన్న‌ది త‌రువాతి విష‌యం

‘జై ల‌వ‌కుశ’ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో వారు మాట్లాడారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే పాత్ర‌లో న‌టించాల‌ని తాను అనుకున్నాన‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నాడు. త‌న కొత్త సినిమాలో ‘జై’ అనే పాత్ర త‌మ‌ గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోతుంద‌ని చెప్పాడు. ఈ సినిమాకి డ‌బ్బులు వ‌చ్చాయా రాలేదా అన్న‌ది త‌రువాతి విష‌యమ‌ని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి పాత్ర‌లో న‌టించాన‌న్న సంతృప్తి ఉంటుంద‌ని అన్నాడు.

ప‌గ‌లు, రాత్రి క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినందుకు మంచి స్పంద‌న వ‌చ్చిందని క‌ల్యాణ్ రామ్ పేర్కొన్నాడు. త‌మ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన మొట్ట‌మొద‌టి సినిమా కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నామ‌ని చెప్పాడు. ఈ క‌థ‌కు తార‌క్ త‌ప్ప ఎవ‌రూ స‌రైన న్యాయం చేయ‌లేరని అన్నాడు. 

ntr
  • Loading...

More Telugu News