died: చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

  • వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఘటన
  • అజయ్ (10), సాయి (9), అఖిల (9) మృతి
  • బట్టలు పిండడానికి వెళ్లగా ఘటన

వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారు గుంజేల అజయ్ (10), సాయి (9), అఖిల (9) అని స్థానికులు చెప్పారు. ఆ ముగ్గురు చిన్నారులు చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లారని తెలిపారు.

వారు ప్రమాదవ శాత్తు చెరువులో పడిపోయారని, ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేర‌ని చెప్పారు. కొద్ది సేప‌టి త‌రువాత ఈ విష‌యాన్ని గ‌మ‌నించామ‌ని, ఆ ముగ్గురి మృతదేహాలను బయటకు తీశామ‌ని చెప్పారు. కాగా, ఆ ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొడదామని చెరువులోకి దిగారని, వారికి ఈత రాకపోవడంతో మునిగిపోయారని కూడా మరికొందరు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News