strikes: భారత్, మయన్మార్ సరిహద్దులో భారత ఆర్మీ ఆప‌రేష‌న్‌.. భారీగా నాగా తీవ్రవాదుల హతం!

  • ఆపరేషన్లో పాల్గొన్న 70 మంది భార‌త జ‌వాన్లు
  • పెద్ద ఎత్తున తీవ్ర‌వాదుల హ‌త‌ం
  • ఈ రోజు తెల్ల‌వారు జామున 4.45 గంట‌ల‌కు దాడి

భారత్-మయన్మార్ సరిహద్దులో భారత ఆర్మీ ఈ రోజు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సుమారు 70 మంది భార‌త జ‌వాన్లు నాగా తీవ్రవాదుల శిబిరాల‌పై మెరుపుదాడులు చేశారు. ఈ ఆప‌రేష‌న్‌లో పెద్ద ఎత్తున తీవ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ఆప‌రేష‌న్‌లో భార‌త జ‌వాన్ల‌కి ఎటువంటి గాయాలు కాలేద‌ని సమాచారం.

స‌రిగ్గా ఏడాది క్రితం పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. అదే రీతిలో నాగా తీవ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం హ‌త‌మార్చింది. తీవ్ర వాదుల‌పై కాల్పుల్లో తూర్పు స‌రిహ‌ద్దు బ‌ల‌గాలు పాల్గొన్నాయి. ఈ రోజు తెల్ల‌వారు జామున 4.45 గంట‌ల‌కు ఈ దాడి జ‌రిపామ‌ని ఆర్మీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడింది. 

  • Loading...

More Telugu News