mahesh babu: భారీ రేటుకు 'భరత్ అను నేను' ఓవర్సీస్ హక్కులు!

  • కొరటాల తదుపరి చిత్రంగా 'భరత్ అను నేను'
  •  పొలిటికల్ లీడర్ గా మహేశ్ బాబు
  •  ఓవర్సీస్ హక్కులు 18.18 కోట్లకు
  •  కథానాయికగా కైరా అద్వాని

కొరటాల శివ తదుపరి చిత్రంగా 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. 'స్పైడర్' ప్రమోషన్స్ పూర్తవ్వగానే తిరిగి మహేశ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి.

 ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది. ఇందుకుగాను 18.18 కోట్లను చెల్లించినట్టు సమాచారం. మహేశ్ బాబుకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది. అంతే కాకుండా ఇది 'శ్రీమంతుడు' కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడం వలన మరింత క్రేజ్ వుంది. ఈ కారణంగానే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఈ స్థాయిలో పలికినట్టుగా చెబుతున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.    

  • Loading...

More Telugu News