allu arjun: ఊటీ షూటింగులో అల్లు అర్జున్ .. కీలక సన్నివేశాల చిత్రీకరణ

  • హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన 'నా పేరు సూర్య'
  •  ఊటీలో ప్రధాన పాత్రధారులపై చిత్రీకరణ
  •  కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
  •  ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు    

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, ఆ తరువాత ఊటీకి చేరుకుంది.

కొన్ని రోజులుగా అక్కడ కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. ప్రధాన పాత్రధారులంతా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. నిర్మాత శిరీషా శ్రీధర్ మాట్లాడుతూ .. పక్కాగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని అన్నారు. అల్లు అర్జున్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో వుంటాయని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.    

  • Loading...

More Telugu News