rajasekhar: రానా చేతుల మీదుగా 'గరుడ వేగ' టీజర్

  •  షూటింగ్ ముగింపు దశలో 'పీఎస్వీ గరుడ వేగ'
  •  రానా చేతుల మీదుగా రేపు టీజర్ రిలీజ్ 
  •  కథానాయికగా పూజా కుమార్ 
  •  సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ స్పెషల్  

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా 'పీఎస్వీ గరుడ వేగ' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ చాలావరకూ పూర్తయింది. మిగతా చిత్రీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో వున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.

 రేపు సాయంత్రం 5 గంటలకు రానా అధికారిక ఫేస్ బుక్ .. ట్విట్టర్ ద్వారా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో రానా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలియంది కాదు. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేయించడం వలన, అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. పూజా కుమార్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం.     

  • Loading...

More Telugu News