sai dharam tej: దసరాకి సెట్స్ పైకి మెగా హీరో మూవీ!


  •  వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
  •  కథానాయికగా లావణ్య త్రిపాఠి
  •  ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలోనే
  •  దర్శక నిర్మాతల పరిశీలనలో 'దుర్గ' టైటిల్  

విజయదశమికి థియేటర్లకు రావడానికి కొన్ని సినిమాలు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే, మరికొన్ని సినిమాలు ఫస్టులుక్ లు .. టీజర్లు వదలడానికి రెడీ అవుతున్నాయి. ఈ పండుగ రోజుల్లో  సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంతమంది దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ జాబితాలో సాయిధరమ్ తేజ్ సినిమా కూడా ఉండటం విశేషం.

 రీసెంట్ గా 'జవాన్' సినిమాను పూర్తిచేసిన సాయిధరమ్ తేజ్, వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టులో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి 'దుర్గ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో, కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించనుంది.    

  • Loading...

More Telugu News