kalva srinivasulu: వైసీపీ నేత‌లు మాట్లాడే భాష‌ మ‌నుషులు మాట్లాడేదేనా?: కాల్వ శ్రీనివాసులు

  • సభ్య‌స‌మాజం అస‌హ్యించుకునేలా జ‌గ‌న్‌ వ్యాఖ్యలు
  • జగన్ కి అండగా రోజా, చెవిరెడ్డి, భూమన, కొడాలి నాని 
  • టీడీపీ నేతలు అలా ఎప్పుడైనా మాట్లాడారా?

వైసీపీ నేత‌లు మాట్లాడే భాష‌ మ‌నుషులు మాట్లాడేదేనా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... సభ్య‌స‌మాజం అస‌హ్యించుకునేలా మాట్లాడ‌డం జ‌గ‌న్‌కే చెల్లిందని అన్నారు. సీఎంని ఉరితీయాల‌ని, న‌డిబ‌జారులో కాల్చి చంపేయాల‌ని మాట్లాడార‌ని అన్నారు. ఇది అంద‌రూ ముక్త కంఠంతో ఖండిస్తే ఆవేద‌నతో మాట్లాడాన‌ని ఈసీకి చెప్పి, మ‌ళ్లీ అటువంటి వ్యాఖ్య‌లే చేశారని తెలిపారు.

తుని విధ్వంసం కేసు నుంచి, రాజ‌ధాని భూముల్లో చెరుకు తోట‌లకి నిప్పుపెట్టిన ఘ‌ట‌న‌ల వ‌ర‌కు దాని వెనుక‌ ప్రత్యక్షంగానో, ప‌రోక్షంగానో వైసీపీ ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్ర‌బాబు మీద, మంత్రి లోకేశ్ బాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తోన్న వ్యాఖ్య‌లు చూస్తోంటే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ఎలా దిగ‌జార్చేలా చేస్తున్నారో తెలుస్తోంద‌ని అన్నారు. నాయ‌కుడి మాట‌తీరుని చూసే ఆయ‌న ఎటువంటి వాడో చెప్ప‌వ‌చ్చని అన్నారు.

జ‌గ‌న్‌ రాజ‌కీయ చెల్లె‌మ్మ రోజ‌మ్మ అని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అలాగే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, కొడాలి నాని లాంటి వారు ఎలా మాట్లాడుతున్నారో అంద‌రికీ తెలుసని అన్నారు. వీరు నలుగురు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అంగీక‌రించ‌ని భాష‌ను, స‌మాజం అసహ్యించుకునే వ్యాఖ్య‌ల‌ను చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబుని చూస్తే నాలుగు ద‌శాబ్దాల కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నార‌ని, తమ పార్టీ నేత‌లు అశోక్ గ‌జ‌ప‌తి రాజు, తెలంగాణ‌లోని దేవేంద‌ర్ గౌడ్, కేఈ కృష్ణ‌మూర్తి ఎప్పుడైనా అటువంటి వ్యాఖ్య‌లు చేశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

  • Loading...

More Telugu News