mahesh babu: ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో 'స్పైడర్' రిలీజ్


'స్పైడర్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మహేశ్ బాబు అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సినిమాను ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 400 లొకేషన్స్ లో అక్కడ ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ ఇది రెండవ అతి పెద్ద రిలీజ్ అని చెబుతున్నారు. ఇక తెలుగు వెర్షన్ ను 600 థియేటర్స్ లోను .. తమిళ వెర్షన్ ను 150 థియేటర్స్ లోను రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాను ఈ నెల 27వ తేదీ విడుదల చేస్తున్నారు. 26వ తేదీ రాత్రి ప్రీమియర్స్ తో ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాపై, ఇటు తెలుగులోనూ .. అటు తమిళంలోను భారీ అంచనాలు వున్నాయి. కోలీవుడ్ లోకి ఈ సినిమాతోనే నేరుగా అడుగుపెడుతోన్న మహేశ్ బాబు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమనే నమ్మకంతో వున్నాడు.   

  • Loading...

More Telugu News